చరణ్ కి హిట్ ఇచ్చిన దర్శకుడితో సాయితేజ్!

  • అనుకోకుండా సాయితేజ్ కి వచ్చిన గ్యాప్
  • ఇక పై వరుస సినిమాలు చేయాలనే ఆలోచన 
  • వరుసగా కథలు వింటున్న సాయితేజ్ 
  • సంపత్ నందికి ఛాన్స్ ఇచ్చినట్టుగా టాక్
సాయితేజ్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'విరూపాక్ష' రెడీ అవుతోంది. హారర్ థ్రిల్లర్ జోనర్లో రూపొందుతున్న ఈ సినిమా, ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇక వరుస ప్రాజెక్టులను సాయితేజ్ లైన్లో పెట్టే పనిలో ఉన్నాడు. తన దగ్గరికి వచ్చే కథలను వినడానికి ఆయన ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాడని సమాచారం.   

ఈ నేపథ్యంలోనే సంపత్ నంది ఆయనకి ఒక కథను వినిపించాడనీ, ఇంతవరకూ తాను చేసిన సినిమాలకు ఈ కథ భిన్నంగా ఉండటంతో, సాయితేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించనున్నాడని చెబుతున్నారు. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు. 

ఇంతవరవరకూ సంపత్ నంది చేసిన సినిమాల్లో 'రచ్చ ' .. 'బెంగాల్ టైగర్' భారీవిజయాలను అందుకున్నాయి. మాస్ యాక్షన్ సినిమాలను ఆయన బాగా తీయగలడనే పేరు తెచ్చాయి. అయితే ఇటీవల కాలంలో ఆయనకి సరైన హిట్ పడలేదు. సాయితేజ్ తో చేసే సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ఉన్నాడని చెబుతున్నారు.


More Telugu News

Sai Tej Sampath Nandi Tollywood