Jagan: జగన్ లండన్ పర్యటన రద్దు?

  • ఈ నెల 21న లండన్ కు వెళ్లాల్సిన జగన్
  • అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ నేపథ్యంలో పర్యటనను రద్దు చేసుకున్నట్టు సమాచారం
  • నిన్ననే అవినాశ్ తండ్రిని అరెస్ట్ చేసిన సీబీఐ
Jagan London tour

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కుటుంబ సమేతంగా లండన్ పర్యటనకు వెళ్లాలనుకున్న సంగతి తెలిసిందే. పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 21న ఆయన లండన్ కు బయల్దేరాల్సి ఉంది. విజయవాడ నుంచి ముంబైకు ప్రత్యేక విమానంలో వెళ్లి, అక్కడి నుంచి లండన్ విమానం ఎక్కాల్సి ఉంది. అయితే ఆ పర్యటన రద్దయినట్టు తెలుస్తోంది. తన బంధువు, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ నేపథ్యంలో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారని చెపుతున్నారు. నిన్ననే అవినాశ్ రెడ్డి తండ్రిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ తన అధికారిక కార్యక్రమాలను కూడా రద్దు చేసుకున్నట్టు సమాచారం. ఈనాటి అనంతపురం పర్యటనకు కూడా ముఖ్యమంత్రి వెళ్లలేదు. లండన్ పర్యటన రద్దుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News