Asaduddin Owaisi: అలాంటప్పుడు కోర్టులు ఎందుకు.. మూసేయండి: అసదుద్దీన్ ఒవైసీ

  • యూపీ గ్యాంగ్ స్టర్ కొడుకును ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు
  • మతం పేరుతో ఎన్ కౌంటర్లు చేస్తున్నారంటూ ఒవైసీ మండిపాటు
  • బుల్లెట్లతో న్యాయం చేస్తామన్నప్పుడు కోర్టులు ఎందుకని ప్రశ్న
Better to close the courts says Asaduddin Owaisi

ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ ఆ రాష్ట్ర పోలీసులతో జరిగిన ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. ఈ ఎన్ కౌంటర్ లో అసద్ అహ్మద్ అనుచరుడు, షూటర్ అయిన మరో వ్యక్తి కూడా మృతి చెందాడు. ఉమేశ్ పాల్ హత్య కేసులో అసద్ అహ్మద్ మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. ఈ సందర్భంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎన్ కౌంటర్లు నిర్వహిస్తోందని మండిపడ్డారు. మతం పేరుతో ఎన్ కౌంటర్లు చేస్తున్నారని విమర్శించారు. బుల్లెట్లతో న్యాయం చేస్తామని నిర్ణయించినప్పుడు ఈ కోర్టులు దేనికని ప్రశ్నించారు. న్యాయస్థానాలను మూసి వేయండని అన్నారు.

More Telugu News