Ambati Rambabu: జగన్ ను ఓడించేందుకు పార్టీ పెట్టావా?: పవన్ కు అంబటి రాంబాబు ప్రశ్న

  • జనసేన ఎందుకు పెట్టాడో పవన్ కే తెలియదన్న అంబటి
  • టీడీపీ, జనసేనలకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదని వ్యాఖ్య
  • జగన్ మళ్లీ గెలవడం ఖాయం అన్న అంబటి
Ambati Rambabu fires on Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. జనసేన పార్టీ ఎందుకు పెట్టారో పవన్ కే తెలియదని ఎద్దేవా చేశారు. జగన్ ను ఓడించేందుకు పార్టీ పెట్టావా? లేక చంద్రబాబును పల్లకీ ఎక్కించేందుకు పెట్టావా? అంటూ పవన్ ను ప్రశ్నించారు. ఈ పార్టీలకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదని విమర్శించారు. 

మీ కోసం నేను మంచి చేశాను, నేను చేసిన మంచి మీకు నచ్చితే నన్ను మళ్లీ గెలిపించి ఆశీర్వదించండి అని ధైర్యంగా ప్రజలను అడగగలిగిన ముఖ్యమంత్రి ఒక్క జగన్ మాత్రమేనని చెప్పారు. ఎవరు ఎంతమందితో కలిసి వచ్చినా, ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు ఇంటికి పంపించడం ఖాయమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో పాల్గొన్న అంబటి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News