కేసీఆర్ భూదోపిడీపై ఇక రోజుకో ఎపిసోడ్: రేవంత్ రెడ్డి
- కేసీఆర్ దేశ రాజకీయాలను శాసించాలని చూస్తున్నారన్న రేవంత్
- అందుకే పార్టీలతో బేరసారాలు సాగిస్తున్నారని వెల్లడి
- కేసీఆర్ వంటి గజదొంగతో కాంగ్రెస్ పార్టీ కలవదని స్పష్టీకరణ
కేసీఆర్ భూదోపిడీపై సీబీఐకి లేఖ రాస్తానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ భూదోపిడీని ఓ టీవీ సీరియల్ లాగా బయటపెడతానని తెలిపారు. రేపు యశోద హాస్పిటల్స్ కు భూకేటాయింపుల్లో దోపిడీ కోణం ఎపిసోడ్ బయటపెడతానని వెల్లడించారు. కరోనా చికిత్స ఔషధం రెమ్ డెసివిర్ ను బ్లాక్ లో అమ్ముకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.