Jagan: ఎన్ఐఏ కోర్టుకు హాజరైన సీఎం జగన్ పీఏ

  • 2018లో విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై కోడికత్తితో దాడి
  • జగన్ పై దాడి చేసిన శ్రీనివాస్ అనే యువకుడు
  • కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును కోరిన జగన్
Jagan PA attended to NIA court in Kodi Kathi case

గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు విచారిస్తోంది. ఈ రోజు జరిగిన కోర్టు విచారణకు నిందితుడు శ్రీనివాస్ హాజరయ్యాడు. మరోవైపు ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి జగన్ కోర్టును మినహాయింపును కోరిన సంగతి తెలిసిందే. జగన్ తరపున ఆయన పీఏ కె నాగేశ్వరరెడ్డి కోర్టుకు హాజరయ్యారు. ఎన్ఐఏ కోర్టు తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. 

2018 అక్టోబర్ లో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనపై ఈ దాడి జరిగింది. ఎయిర్ పోర్టులోని ఒక రెస్టారెంట్ లో పని చేస్తున్న శ్రీనివాస్ ఆయనపై దాడి చేశాడు. ఆ గాయంతోనే జగన్ నేరుగా హైదరాబాద్ కు వచ్చి చికిత్స చేయించుకున్నారు.

More Telugu News