Tirupati: తిరుపతిలో పేకాడుతూ దొరికిన సీఐ, ఏఎస్సై అరెస్ట్

  • తిరుపతి రూరల్ మండలం రాఘవేంద్రనగర్‌లో ఘటన
  • మొత్తం 13 మంది అరెస్ట్
  • నిందితుల్లో ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ సీఐ, ఏఎస్సై
  • వారి నుంచి భారీగా నగదు, కారు స్వాధీనం
  • నిందితుల్లో పలువురు ప్రజాప్రతినిధులు!
Police Arrested Taskforce CI and ASI While They Are Playing Poker

ఓ ఇంట్లో కొందరితో కలిసి పేకాడుతున్న సీఐ, ఏఎస్సై సహా 13 మందిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి వీరిని అరెస్ట్ చేయగా, రెండు రోజుల తర్వాత నిన్న వీరి అరెస్టును పోలీసులు వెల్లడించారు. తిరుపతి రూరల్ మండలం రాఘవేంద్రనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని దానిని కొందరు పేకాట స్థావరంగా మార్చేశారు. అందులో కొందరు పేకాడుతున్నట్టు సమాచారం అందుకున్న తిరుచానూరు పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ సీఐ, ఓ ఏఎస్సై‌తోపాటు మరో 11 మందిని అరెస్ట్ చేశారు. అలాగే వారి నుంచి భారీగా నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన వారిలో పలువురు అధికార పార్టీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే వారి వివరాలను వెల్లడించలేదన్న విమర్శలు వచ్చాయి. ఎస్పీ పరమేశ్వరరెడ్డి జ్యోక్యం చేసుకోవడంతో అదే రోజు రాత్రి పట్టణంలోని తూర్పు పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న జోగారావు, కార్పొరేటర్ ఆంజనేయులు, మరో 9 మందిపై కేసులు నమోదు చేశారు. 

నిందితుల్లో నాగరాజు, డి.సురేశ్, కె.సురేష్, డి.కిరణ్ కుమార్, పి.కృష్ణారెడ్డి, బి.చెంచుముని, ఎన్.శ్రీనివాసులు, కె.మునిప్రసాద్, కె.రాధాకృష్ణ, కార్పొరేటర్ కె.ఆంజనేయులు, ఎస్.నరేంద్ర, ఏఎస్ఐ జోగారావు, సీఐ చంద్రశేఖర్‌లను నిందితులుగా చేర్చారు. మరో ఇద్దరు ప్రజా ప్రతినిదుధులను ఈ కేసు నుంచి తప్పించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

More Telugu News