కేసీఆర్ కు ఉగ్రవాద సంస్థలేమైనా ఆర్థికసాయం చేస్తున్నాయా?: బండి సంజయ్
- కేసీఆర్ కు వేల కోట్లు ఎక్కడ్నించి వచ్చాయన్న బండి సంజయ్
- ప్రతిపక్షాలకు పెట్టుబడి పెట్టే స్థాయికి కేసీఆర్ ఎలా ఎదిగారంటూ వ్యాఖ్యలు
- ప్రజల డబ్బుతో దేశ రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు
ప్రజల నుంచి దోపిడీ చేసిన సొమ్ముతో జాతీయ రాజకీయాలు చేయాలని చూస్తున్నాడని బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం ఆస్తులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రజలే తగిన జవాబు ఇస్తారని స్పష్టం చేశారు. అంతేకాదు, మోదీ విద్యార్హతల సర్టిఫికెట్ నేపథ్యంలోనూ బండి సంజయ్ స్పందించారు. కేసీఆర్ తన విద్యార్హతల సర్టిఫికెట్ ను బయటపెట్టాలని అన్నారు.