Pavan Kalyan: దసరా దిశగానే అడుగులు వేస్తున్న 'వీరమల్లు'

  • క్రిష్ తో 'వీరమల్లు' చేస్తున్న పవన్ 
  • 65 శాతం జరిగిన చిత్రీకరణ
  • త్వరలోనే టాకీ పార్టును పూర్తి చేసే ఆలోచన 
  • దసరాకి రిలీజ్ చేయాలనుకుంటున్న మేకర్స్    
Hari Hara Veeramallu movie updte

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగు మొదలై చాలా కాలమైంది. అయితే కోవిడ్ ఎఫెక్ట్ తరువాత నుంచి ఆశించినంత వేగంగా ఈ సినిమా షూటింగు జరగలేదు. భారీ బడ్జెట్ తో ఎ.ఎమ్. రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకి, క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. కోట్ల రూపాయల ఖర్చుతో వేసిన సెట్స్ లో ఈ షూటింగును జరుపుతూ వస్తున్నారు. 

ఈ నేపథ్యంలోనే సముద్రఖని దర్శకత్వంలో తమిళ రీమేక్ మూవీ షూటింగును పవన్ పూర్తి చేశాడు. దాంతో మరి ''వీరమల్లు' మాటేమిటి? అనేది అందరిలో సందేహాన్ని కలిగిస్తోంది. ఈ సినిమా షూటింగు ఇంతవరకూ 65 శాతం చిత్రీకరణను జరుపుకుంది. ఏప్రిల్ లోనే ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారుగానీ వాయిదా పడింది. 

అలాంటి ఈ సినిమాను దసరాకి రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఇప్పటికే రామ్ - బోయపాటి సినిమాను దసరాకి రిలీజ్ చేయనున్నట్టు ఎనౌన్స్ మెంట్ వచ్చింది. రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' కూడా అక్టోబర్ 20న రానున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు ఆ దిశగానే 'వీరమల్లు' అడుగులు వేస్తుండటం విశేషం. 

More Telugu News