సీబీఐ అంటే మోదీకే నమ్మకం లేదు.. 10 ఏళ్ల కిందటి ట్వీట్ తో కేటీఆర్ విమర్శ!
- బీజేపీ టార్గెట్ గా విమర్శలు కొనసాగిస్తున్న కేటీఆర్
- కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా సీబీఐ మారిపోయిందన్న మోదీ ట్వీట్ కు కామెంట్
- సీబీఐని ప్రధానే నమ్మరని, అందుకే దేశ ప్రజలు కూడా నమ్మరని వ్యాఖ్య
తాజాగా ప్రధాని మోదీని టార్గెట్ చేసుకుని కేటీఆర్ విమర్శలు చేశారు. 10 ఏళ్ల కిందట.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో.. గుజరాత్ సీఎంగా నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ ను తెరపైకి తీసుకొచ్చారు. ‘‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా సీబీఐ మారిపోయింది. ఆ సంస్థపై దేశం విశ్వాసం కోల్పోయింది. సీబీఐతో భయపెట్టాలని చూడొద్దని కేంద్రానికి స్పష్టం చేస్తున్నా’’ అని ట్వీట్ లో మోదీ పేర్కొన్నారు.
దీనిపై కేటీఆర్ ట్వీట్ చేస్తూ.. ‘‘సీబీఐ లాంటి కేంద్ర సంస్థలపై దేశానికి ఎందుకు నమ్మకం లేదు?.. ఎందుకంటే గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారే సీబీఐని నమ్మరు కాబట్టి!!’’ అని ఎద్దేవా చేశారు.