Krishnavamsi: మా అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ..!: కృష్ణవంశీ

  • ఫ్యామిలీ గురించి ప్రస్తావించిన కృష్ణవంశీ
  • ఇంట్లో నుంచి పారిపోయి ఇండస్ట్రీకి వచ్చానని వెల్లడి  
  • 'అంతఃపురం' సమయంలోనే తండ్రి చనిపోయారని వివరణ 
  • తమ తనయుడు రిత్విక్ వంశీ టీనేజ్ కి వచ్చాడని హర్షం 
  • మంచి సంరక్షణలో ఉన్నాడని చెప్పిన కృష్ణవంశీ 
Krishna vamsi Interview

కృష్ణవంశీ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'రంగమార్తాండ' రెడీ అవుతోంది. ఈ నెల 22వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్లో కృష్ణవంశీ తన గురించిన అనేక విషయాలను ప్రస్తావించారు. " నేను బాగా చదువుకుని .. మంచి జాబ్ చేస్తూ లైఫ్ లో సెటిల్ అవ్వాలని మా పేరెంట్స్ కి ఉండేది. నాకు సినిమా తప్ప ఏదీ కనెక్ట్ కాలేదు. అందువలన ఇంట్లో చెప్పకుండా పారిపోయి వచ్చాను "  

" సినిమా తప్ప నాకు రెండో ఆలోచన ఉండదు. సినిమా ఫంక్షన్స్ కి గానీ .. ఫ్యామిలీ ఫంక్షన్స్ కి గాని నేను వెళ్లను .. అది నాకు అంత కంఫర్టబుల్ గా అనిపించదు. నేను 'అంతఃపురం' సినిమా చేస్తున్నప్పుడు మా నాన్నగారు పోయారు. అమ్మ మాతోనే ఉంటారు .. నా దగ్గర తప్ప ఆమె మరెక్కడా ఉండలేరు. అమ్మకి కూడా ఈ సినిమా చూపించాలి" అని చెప్పారు. 

"ప్రస్తుతం మా అబ్బాయి రిత్విక్ వంశీ టీనేజ్ లో ఉన్నాడు. అందువలన అతని అభిప్రాయలు .. అభిరుచులు వారానికి ఒకసారి మారుతూ ఉంటాయి. ఒకసారి క్రికెట్ అంటాడు .. మరోసారి ఫుట్ బాల్ అంటాడు .. ఇంకోసారి ఇంకా ఏదో అంటాడు. తనకి సంబంధించిన అన్ని విషయాలను రమ్యనే చూసుకుంటూ ఉంటుంది. వాడి చదువుకు సంబంధించిన విషయాలను రమ్య సిస్టర్ కూడా పట్టించుకుంటుంది. మంచి సంరక్షణలోనే ముందుకు వెళుతున్నాడు " అని చెప్పుకొచ్చారు. 

More Telugu News