పాకిస్థాన్ లో దారుణం.. హిందూ వైద్యుడి గొంతు కోసి హత్య

Driver slits Hindu doctors throat in Pakistan arrested
షార్ట్స్‌లో చూడండి
పాకిస్థాన్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హైదరాబాద్‌ (పాక్ లోని నగరం)కు చెందిన ప్రముఖ చర్మవ్యాధుల నిపుణుడు డా. ధరమ్‌దేవ్ రాఠీని ఆయన డ్రైవర్ మంగళవారం గొంతు కోసి చంపేశాడు. ఆ మరుసటి రోజే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కారులో ఇంటికి వస్తుండగా డా. ధరమ్‌దేవ్‌కు, డ్రైవర్‌కు మధ్య గొడవ జరిగినట్టు ధరమ్‌దేశ్ ఇంట్లోని వంటమనిషి పోలీసులకు తెలిపింది. ఈ క్రమంలో వైద్యుడు ఇంట్లోకి వచ్చాక డ్రైవర్ వంటగదిలోని కత్తి తీసుకుని ఆయన గొంతు కోసి చంపేశాడు. ఆ తరువాత ధరమ్‌దేవ్ కారులోనే అక్కడి నుంచి ఉడాయించాడు. 

కాగా.. పాకిస్థాన్‌లో మైనారిటీలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో వైద్యుడి హత్య తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనను రాజకీయ పార్టీలు ఖండించాయి. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని పీపీపీ పార్టీ మహిళ శాఖ చీఫ్ హామీ ఇచ్చారు. పాకిస్థాన్‌లో హిందువులు హోలీ జరుపుకుంటున్న వేళ ఈ ఘటన జరగడం విచారకరమని వ్యాఖ్యానించారు. మరోవైపు.. హత్య జరిగిన 24 గంటలకే నిందితుడిని పట్టుకున్న పోలీసులను పాకిస్థాన్ మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశంసించారు. కాగా..డా.ధరమ్‌దేవ్‌కు స్థానికంగా గొప్ప పేరుందని పాకిస్థాన్ మీడియా పేర్కొంది.
Go Back to Shorts
Pakistan

More Telugu News