నేటి మ్యాచ్ ను వీక్షించనున్న ఇద్దరు ప్రధానులు..!
- భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరి టెస్టు
- మ్యాచ్ను వీక్షించనున్న భారత్-ఆస్ట్రేలియా ప్రధానులు
- కాసేపు కామెంటరీ చెప్పనున్న మోదీ
- బంగారు పూత పూసిన కారులో స్టేడియంలో తిరగనున్న మోదీ, అల్బనీస్
అలాగే, మోదీ కాసేపు కామెంటరీ కూడా చెబుతారని సమాచారం. మ్యాచ్కు ముందు ప్రధానులు ఇద్దరు బంగారు పూత పూసిన గోల్ఫ్ కారులో స్టేడియంలో తిరుగుతారని కూడా తెలుస్తోంది.
లక్షమంది ప్రేక్షకులు
ఈ టెస్టు భారత్కు ఎంతో కీలకం. ఈ మ్యాచ్ను కైవసం చేసుకుంటే భారత జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు చేరుకోవడమే కాకుండా సిరీస్ భారత్ సొంతమవుతుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. మ్యాచ్ను వీక్షించేందుకు నేడు లక్షమంది ప్రేక్షకులు వస్తారని అంచనా. ఇప్పటికే 75 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. ప్రధాని రాక నేపథ్యంలో స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కాగా, తమ అభిమానుల కోసం స్టేడియంలో ప్రత్యేకంగా టికెట్ల విక్రయం చేపట్టినట్టు ‘క్రికెట్ ఆస్ట్రేలియా’ తెలిపింది.