Team India: కీలకమైన నాలుగో టెస్టుకు ముందు హోలీ వేడుకల్లో టీమిండియా.. పిక్స్ ఇవిగో!

  • చివరి టెస్ట్ కోసం అహ్మదాబాద్ కు చేరుకున్న టీమిండియా
  • రంగులు పూసుకుని హోలీ సెలెబ్రేట్ చేసుకున్న మన ఆటగాళ్లు
  • బస్సులో కూడా రంగోలీ వేడుకలు
Team India players celebrates Holi

హోలీ వేడుకులను టీమిండియా ఆటగాళ్లు ఘనంగా జరుపుకున్నారు. ఆస్ట్రేలియాతో చివరి టెస్టు అహ్మదాబాద్ లో జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు అహ్మదాబాద్ కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ కు వెళ్లే సమయంలో బస్సులోను, ఆ తర్వాత మైదానంలోనూ భారత ఆటగాళ్లు హోలీ జరుపుకున్నారు. రంగులు పూసుకుని ఎంజాయ్ చేశారు. రంగులతో నిండిపోయిన ఆటగాళ్లు నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు. 

మరోవైపు నాలుగు మ్యాచ్ ల ఈ టెస్ట్ లో ఇండియా 2-1తో లీడ్ లో ఉంది. చివరి టెస్ట్ ను కూడా గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలని ఆసీస్ పట్టుదలతో ఉంది. 

More Telugu News