Nara Rohit: ఏపీ గాడిలో పడాలంటే మళ్లీ చంద్రబాబు రావాలి: నారా రోహిత్

  • సత్తెనపల్లిలో ఎన్టీఆర్, కోడెల విగ్రహాలను ఆవిష్కరించిన రోహిత్
  • కోడెల మన మధ్య లేకపోవడం బాధాకరమని వ్యాఖ్య
  • వచ్చే ఎన్నికల్లో కోడెల శివరామ్ విజయం సాధిస్తారని ధీమా
For AP development Kodela has come in to power says Nara Rohit

అన్ని విధాలుగా నాశనం అయిన ఏపీ మళ్లీ గాడిలో పడాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని సినీ హీరో నారా రోహిత్ అన్నారు. సత్తెనపల్లిలో ఎన్టీఆర్, కోడెల శివప్రసాద్ విగ్రహాలను ఈరోజు నారా రోహిత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. నారా రోహిత్ కు కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామ్ ఘన స్వాగతం పలికారు. రోహిత్ తో కలిసి భారీ ర్యాలీని నిర్వహించారు. 

ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ, 2019లో తాను సత్తెనపల్లికి వచ్చానని.... కోడెల శివప్రసాద్ తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించానని చెప్పారు. ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరమని... ఎన్టీఆర్ కి, కోడెల శివప్రసాద్ కి మరణం అన్నది లేదని... వీరు టీడీపీ జెండాలో, కార్యకర్తల గుండెల్లో నిలిచే ఉంటారని అన్నారు. అందరి ఆశీర్వాదాలతో కోడెల శివరామ్ వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News