Gujarat Giants: డబ్ల్యూపీఎల్: యూపీ వారియర్స్ ముందు 170 పరుగుల టార్గెట్

  • డీవై పాటిల్ స్టేడియంలో యూపీ వారియర్స్ తో గుజరాత్ ఢీ
  • మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు
  • 46 పరుగులు సాధించిన హర్లీన్ డియోల్
Gujarat Giants set UP Warriarz 170 runs target

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఆసక్తికరంగా సాగుతోంది. ఇవాళ రెండో మ్యాచ్ లో యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసింది. 

హర్లీన్ డియోల్ 32 బంతుల్లో 7 ఫోర్లతో 46 పరుగులు చేయగా, ఓపెనర్ గా వచ్చిన తెలుగుమ్మాయి సబ్బినేని మేఘన 15 బంతుల్లో 5 ఫోర్లతో 24 పరుగులు చేసి శుభారంభం అందించింది. ఆష్లే గార్డనర్ 25, దయాలన్ హేమలత 21 (నాటౌట్) పరుగులు సాధించారు. 

యూపీ వారియర్స్ బౌలర్లలో దీప్తి శర్మ 2, సోఫీ ఎకెల్ స్టోన్ 2, తెలుగమ్మాయి అంజలి శ్రావణి 1 వికెట్, తహ్లియా మెక్ గ్రాత్ 1 వికెట్ తీశారు.

More Telugu News