రాహుల్ ను పీఎం చేయడమే తన కోరిక అని వైఎస్సార్ చెప్పారు: భట్టి విక్రమార్క
- దేశాన్ని బీజేపీ మతపరంగా విడదీస్తోందన్న భట్టి విక్రమార్క
- ప్రభుత్వ భూములను బీఆర్ఎస్ అమ్మేస్తోందని విమర్శ
- హైదరాబాద్ లో అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరిగిందని వ్యాఖ్య
హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి కూడా కాంగ్రెస్ హయాంలో జరిగిందేనని చెప్పారు. హైదరాబాద్ కు నీళ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తన కోరిక అని రాజశేఖరరెడ్డి చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రలను విజయవంతం చేయాలని కోరారు.