కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్... రోగి సహా ఐదుగురి మృత్యువాత
- అమెరికాలో విషాద ఘటన
- నెవాడా సరిహద్దుల్లో కూలిపోయిన ఎయిర్ అంబులెన్స్ విమానం
- ప్రమాదం సమయంలో విమానంలో ఐదుగురు
- అందరూ మరణించారన్న అధికారులు
కాగా, నెవాడా సరిహద్దుల్లోకి వచ్చేసరికి విమానం రాడార్ తో సంబంధాలు కోల్పోయింది. సెంట్రల్ లియోన్ కౌంటీలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఎయిర్ అంబులెన్స్ విమానంలో పైలెట్, రోగి, రోగి సహాయకుడు, నర్సు, పారామెడికల్ నిపుణుడు ఉన్నారు. వీరందరూ ప్రాణాలు కోల్పోయినట్టు సెంట్రల్ లియోన్ కౌంటీ అధికారులు నిర్ధారించారు.