Jagan: నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులను సతీసమేతంగా కలిసిన సీఎం జగన్

  • ఏపీ కొత్త గవర్నర్ గా అబ్దుల్ నజీర్ నియామకం
  • రాజ్ భవన్ కు వెళ్లిన జగన్, వైఎస్ భారతి
  • గవర్నర్ దంపతులతో మర్యాదపూర్వక భేటీ
CM Jagan met governor couple along with his wife YS Bharathi

ఏపీ నూతన గవర్నర్ గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో, ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్, వైఎస్ భారతి గవర్నర్ దంపతులతో భేటీ అయ్యారు. 

గవర్నర్ కు సీఎం జగన్ ఓ మొక్కను బహూకరించగా, వైఎస్ భారతి గవర్నర్ అర్ధాంగికి ఓ చీరను కానుకగా ఇచ్చారు. అనంతరం గవర్నర్ దంపతులతో జగన్, భారతి కాసేపు ముచ్చటించారు. వివిధ అంశాలపై సీఎం జగన్, గవర్నర్ నజీర్ మధ్య చర్చ జరిగింది.

More Telugu News