ప్రధాని మోదీ ర్యాలీకి అనుమతి ఇవ్వని మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం
- మేఘాలయలోని తురాలో ఈనెల 24న మోదీ ర్యాలీ
- పీఏ సంగ్మా స్టేడియంలో ర్యాలీకి అనుమతి నిరాకరించిన మేఘాలయ క్రీడా శాఖ
- మోదీ హవాను చూసి భయపడే ఇలా చేస్తున్నారని బీజేపీ ఆరోపణ
స్టేడియం ప్రారంభోత్సవం జరిగిన రెండు నెలల తర్వాత ప్రధానమంత్రి ర్యాలీకి స్టేడియం అసంపూర్తిగా ఉందని, అందుబాటులో లేదని ఎలా చెబుతారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కావాలనే ప్రధాని మోదీ ర్యాలీ, సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. మేఘాలయలో మోదీ హవా చూసి అక్కడి ప్రభుత్వం భయపడుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రితురాజ్ సిన్హా అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల ర్యాలీలకు ప్రజల స్పందన చూసి ఇతర పార్టీలు అవాక్కయ్యాయని సిన్హా ఆరోపించారు. కాగా, 60 స్థానాలతో కూడిన మేఘాలయ అసెంబ్లీకి ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 2న కౌంటింగ్ నిర్వహించి ఫలితం వెల్లడిస్తారు.