టీమిండియా - ఆస్ట్రేలియాల మధ్య మూడో టెస్ట్ వేదిక మార్పు
- ధర్మశాలలో విపరీతమైన చలి
- ఔట్ ఫీల్డ్ లో సరిగా పెరగని గడ్డి
- వేదికను ఇండోర్ కు మార్చిన బీసీసీఐ
ధర్మశాల స్టేడియంలో ఔట్ ఫీల్డ్ మ్యాచ్ ఆడేందుకు అనుగుణంగా లేదని బీసీసీఐ క్యూరేటర్ తపోష్ చటర్జీ నిన్న బీసీసీఐకి నివేదికను అందించారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఔట్ ఫీల్డ్ లో గడ్డి సరిగా పెరగలేదని ఆయన తెలిపారు.
మరోవైపు 4 టెస్ట్ ల ఈ సిరీస్ లో ఇండియా 1-0 లీడ్ లో ఉంది. నాగ్ పూర్ లో జరిగిన తొలి టెస్ట్ లో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఆసీస్ ను చిత్తు చేసింది. రెండో టెస్ట్ ఫిబ్రవరి 17న ఢిల్లీలో ప్రారంభంకానుంది. చివరి టెస్ట్ మార్చ్ 9వ తేదీ నుంచి అహ్మదాబాద్ లో జరుగుతుంది.