Jagan: కీలక నిర్ణయాలను తీసుకున్న ఏపీ కేబినెట్

  • సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం
  • పలు సంక్షేమ పథకాలకు ఆమోదం
  • 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల పోస్టుల భర్తీకి ఆమోదం
AP Cabenet meeting decisions

ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియా సమావేశంలో వెల్లడించారు. 


ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు:
  • వైఎస్సార్ లా నేస్తం, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ కల్యాణమస్తు, ఈబీసీ నేస్తం కార్యక్రమాలకు ఆమోదం. 
  • ఉగాది సంక్షేమ పథకాలకు ఆమోదం. 
  • జగనన్న విద్యాదీవెన చెల్లింపులకు ఆమోదం. 
  • విశాఖలో టెక్ పార్క్ ఏర్పాటుకు ఆమోదం. 
  • లీగల్ సెల్ అథారిటీలో ఖాళీ పోస్టుల భర్తీకి ఆమోదం. 
  • రామాయపట్నం పోర్టులో 2 క్యాపిటల్ బెర్త్ ల నిర్మాణానికి ఆమోదం. 
  • పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకు ఆమోదం. 
  • 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల పోస్టుల భర్తీకి ఆమోదం.

More Telugu News