- ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్
- ఒకరి మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు
- మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. లాలంకోడూరు సమీపంలోని ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. పేలుడు సమయంలో భారీ శబ్దం రావడంతో తీవ్ర భయాందోళనకు గురైన కార్మికులు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.