వాయుగుండం.. రేపు ఏపీకి వర్ష సూచన
- ఫిబ్రవరి 1న శ్రీలంకలో తీరం దాటనున్న వాయుగుండం
- ఏపీలోని ఓడరేవులకు ఒకటో నెంబర్ హెచ్చరిక
- రేపు ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు వర్ష సూచన
ఈ నేపథ్యంలో ఏపీలోని నిజాంపట్నం, మచిలీపట్నం, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం ఓడరేవుల్లో ఒకటో నంబర్ హెచ్చరికను జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.