Advertisement

నారా లోకేశ్ పాదయాత్రలో భారీ ఏర్పాట్లు.. 200 మంది బౌన్సర్లు, 400 మంది వాలంటీర్లు

Huge arrangements for Lokesh padayatra
  • రెండో రోజుకు చేరుకున్న లోకేశ్ పాదయాత్ర
  • 4 వేల కిలోమీటర్ల మేర కొనసాగనున్న యాత్ర
  • భారత్ జోడో యాత్రను మోడల్ గా తీసుకుని యువగళం యాత్ర
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సుదీర్ఘ పాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది. మరోవైపు పాదయాత్ర సందర్భంగా ప్రత్యేకమైన ఏర్పాట్లను చేశారు. భోజనం, బహిరంగసభలు, వసతి ఏర్పాట్లకు సంబంధించి దాదాపు 200 మంది బౌన్సర్లు, 400 మంది వాలంటీర్లను నియమించారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను మోడల్ గా తీసుకుని యువగళం యాత్రను ప్లాన్ చేశారు. మరోవైపు లోకేశ్ పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది.
Advertisement
Nara Lokesh
Yuva Galam
Telugudesam

More Telugu News