నేడు టీమిండియా, న్యూజిలాండ్ జట్లు సాధనలో బిజీబిజీ!
- మధ్నాహ్నం ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేయనున్న కివీస్
- రాత్రి ఫ్లడ్ లైట్స్ వెలుతురులో టీమిండియా సాధన
- రేపు ఇరు జట్ల మధ్య మొదటి వన్డే
మ్యాచ్ కు మరో రోజు మాత్రమే ఉంటడంతో ఇరు జట్లూ ఈ రోజు బిజీబిజీగా గడపనున్నాయి. ఉప్పల్ స్టేడియంలో భారత్, కివీస్ సాధన (ప్రాక్టీస్) లో పాల్గొంటాయి. తొలుత న్యూజిలాండ్ జట్టు మధ్యాహ్నం 1 నుంచి 4 వరకు ప్రాక్టీస్ చేయనుంది. ప్రాక్టీస్ తర్వాత ఆ జట్టు కెప్టెన్ టామ్ లాథమ్ మీడియాతో మాట్లాడుతాడు. ఆపై, భారత జట్టు 5 నుంచి 8 వరకు ఫ్లడ్ లైట్స్ వెలుతురులో ప్రాక్టీస్ లో పాల్గొంటుంది. ప్రాక్టీస్ ముందే కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ లో ఒకరు మీడియా సమావేశంలో పాల్గొననున్నారు. రేపు మధ్యాహ్నం 1.30 నుంచి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది.