Subba Raju: ఈ లోకం ఏదీ ఇవ్వదు .. లాక్కోవాలి: ఆసక్తిని రేపుతున్న ATM ట్రైలర్ డైలాగ్!

  • జీ 5 నుంచి మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ 
  • ATM దొంగతనం నేపథ్యంలో సాగే కథ 
  • పోలీస్ ఆఫీసర్ పాత్రలో సుబ్బరాజు 
  • ఈ నెల 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్
ATM Trailer Released

జీ 5లో ఇంతవరకూ ఎన్నో వైవిధ్యభరితమైన వెబ్ సిరీస్ వచ్చాయి. అలాగే మరో వెబ్ సిరీస్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ద్వారా పలకరించడానికి రెడీ అవుతోంది. ఆ వెబ్ సిరీస్ పేరే 'ATM'. ఈ వెబ్ సిరీస్ కి దర్శకుడు హరీశ్ శంకర్ కథను అందించడం ఒక విశేషమైతే, దిల్ రాజు ప్రొడక్షన్స్ లో నిర్మితం కావడం మరో విశేషం. 

ఈ కథ అంతా కూడా ATM లో జరిగిన దొంగతనం చుట్టూ తిరుగుతుంది. చంద్రమోహన్ కథ - స్క్రీన్ ప్లే అందించిన ఈ వెబ్ సిరీస్, ఈ నెల 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కథకి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ చూస్తే, పాయింట్ ఏమిటనేది అర్థమైపోతుంది. 

ఓ నలుగురు బస్తీ కుర్రాళ్లు చేసిన దొంగతనం .. వాళ్ల కోసం పోలీస్ ఆఫీసర్ సుబ్బరాజు సాగించే వేట ఈ సినిమాలోని ప్రధానమైన అంశం అనే విషయం తెలిసిపోతోంది. 'అందరూ డబ్బు దాచుకుంటారు .. మేము వాటిని దోచుకుంటాం' .. ఈ లోకం ఏదీ ఇవ్వదు .. లాక్కోవాలి' వంటి డైలాగ్స్ ఉండడం వల్ల కంటెంట్ విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది.

More Telugu News