గడపగడపకూ కార్యక్రమంలో దేవినేని అవినాశ్ కు చేదు అనుభవం
- రాణిగారితోటలో మహిళల ఆగ్రహం
- మీ కోసం పని చేసినా.. మోసం చేశారంటూ కార్పొరేటర్ పై ఆగ్రహం
- మౌనంగా ఉండిపోయిన దేవినేని అవినాశ్
ఈ సందర్భంగా రమీజా అనే మహిళ ఇంటిపై టీడీపీ జెండా ఉండటాన్ని గమనించిన అవినాశ్.... ఈ జెండా మనం పెట్టిందేనా? అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా... మీరు గుడివాడలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఈ జెండాను పెట్టామని ఆమె చెప్పారు. దీంతో, అవినాశ్ మౌనంగా ఉండిపోయారు. మీ వెంటే తిరిగామని, అయినా తమకు మోసం జరిగిందని కార్పొరేటర్ ను చూపిస్తూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.