విజయవాడ రైల్వే స్టేషన్లో రోబోటిక్ మసాజ్ సెంటర్!
- ఒకటో నెంబరు ప్లాట్ఫాంపై ఏర్పాటు
- రెండు బాడీ మసాజ్, ఒక ఫుట్ మసాజ్ కుర్చీ ఏర్పాటు
- బాడీ మసాజ్కు రూ. 60, ఫుట్ మసాజ్కు రూ. 30
దక్షిణ మధ్య రైల్వే డివిజినల్ మేనేజర్ శివేంద్ర మోహన్ సోమవారం దీనిని ప్రారంభించారు. బాడీ మసాజ్కు రూ. 60, ఫుట్ మసాజ్కు రూ. 30 రుసుము చెల్లించి రోబోటిక్ మసాజ్ సేవలను పొందొచ్చని ఐఆర్టీఎస్ సీనియర్ డీసీఎం వి.రాంబాబు పేర్కొన్నారు. కాగా, స్టేషన్లో ఇటీవల ఫిష్ స్పా, హ్యాండ్లూమ్స్ అండ్ క్రాఫ్ట్స్, మొబైల్ యాక్ససరీలకు సంబంధించిన అవుట్లెట్లను ప్రారంభించారు.