గుండెపోటుతో 12 ఏళ్ల బాలుడి మృతి!
- కర్ణాటకలోని మడికేరి జిల్లాలో ఘటన
- ఆరో తరగతి చదువుతున్న బాలుడు
- ఆడుకుని ఇంటికొచ్చి గుండెనొప్పితో విలవిల్లాడిన చిన్నారి
- ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి
జిల్లాలోని కూడుమంగళూరుకు చెందిన మంజాచారి పాఠశాల బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడి కుమారుడు కీర్తన్ ఆరో తరగతి చదువుతున్నాడు. శనివారం సాయంత్రం స్నేహితులతో ఆడుకుని రాత్రి ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికే గుండెలో నొప్పిగా ఉందని చెబుతూ విలవిల్లాడిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను కుశాలనగర ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలుడు చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారు. కీర్తన్ మృతికి గుండెపోటే కారణమని నిర్ధారించారు.