Sensex: భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

  • విదేశీ పెట్టుబడుల ఉపసంహరణల ప్రభావం
  • 452 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 132 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పర్వం కొనసాగుతోంది. వరుసగా మూడో సెషన్లో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ కోలుకోలేదు. విదేశీ మదుపరులు ఇన్వెస్ట్ మెంట్లను వెనక్కి తీసుకుంటుండటం మార్కెట్లపై ప్రభావాన్ని చూపుతోంది. 

దీంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 452 పాయింట్లు కోల్పోయి 59,900కి పడిపోయింది. నిఫ్టీ 132 పాయింట్లు నష్టపోయి 17,859 కి దిగజారింది. ఈ క్రమంలో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ సూచీ మినహా అన్ని సూచీలు ఈరోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (1.06%), రిలయన్స్ (0.94%), నెస్లే ఇండియా (0.57%), ఐటీసీ (0.40%), ఎల్ అండ్ టీ (0.23%).

టాప్ లూజర్స్:
టీసీఎస్ (-2.97%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.81%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.63%), టెక్ మహీంద్రా (-2.40%), బజాజ్ ఫైనాన్స్ (-1.95%).

More Telugu News