Amit Shah: అయోధ్య రామాలయం ప్రారంభ తేదీని వెల్లడించిన అమిత్ షా

  • త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన అమిత్ షా
  • వచ్చే ఏడాది జనవరి 1 నాటికి సిద్ధమవుతుందన్న కేంద్రమంత్రి
  • కాంగ్రెస్, సీపీఎంపై నిప్పులు చెరిగిన షా
Ram temple will be ready on Jan 1 2024 Says Amit Shah

అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయం ఎప్పుడు ప్రారంభమయ్యేది కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. నిన్న త్రిపురలోని సబ్రూంలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడిన ఆయన.. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి రామాలయం ప్రారంభానికి సిద్ధమవుతుందన్నారు. ‘‘రాహుల్ బాబా సబ్రూం నుంచి చెబుతున్నా.. 1 జనవరి 2024 నాటికి రామాలయం సిద్ధమవుతుంది’’ అని నొక్కి చెప్పారు. పనిలో పనిగా త్రిపురలో ప్రధాన ప్రతిపక్షాలైన సీపీఎం, కాంగ్రెస్‌లను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలు కలిసి అయోధ్యలో రామాలయం నిర్మించకుండా ఏళ్లపాటు ఆ సమస్యను కోర్టులో నానబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, భారత్ జోడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రామాలయ ట్రస్ట్ ప్రతినిధుల్లో పలువురు మద్దతు తెలిపిన నేపథ్యంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమిత్ షా వ్యాఖ్యలను బట్టి వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రామాలయమే బీజేపీ ప్రధాన అస్త్రంగా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు.

More Telugu News