Dinesh Tej: ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ గా 'అలా నిన్ను చేరి' .. టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ రిలీజ్!

  • విభిన్నమైన ప్రేమకథగా 'అలా నిన్ను చేరి'
  • హీరోగా దినేశ్ తేజ్ .. ఆయన జోడీగా హెబ్బా పటేల్
  • సంగీత దర్శకత్వం వహించిన సుభాశ్ ఆనంద్ 
  • త్వరలోనే టీజర్ రిలీజ్  
Ala Ninnu Cheri Title Logo Poster Released

కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం చేస్తూ సాయి సుధాకర్ నిర్మిస్తున్న చిత్రం ‘అలా నిన్ను చేరి’. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో దినేష్ తేజ్ .. హెబ్బా పటేల్ ..  పాయల్ .. రాధాకృష్ణ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'హుషారు' సినిమాతో సక్సెస్ అందుకున్న హీరో దినేష్ తేజ్ మరోసారి ఈ విలక్షణ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా నేటితరం ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ కూడా షురూ చేసి న్యూ ఇయర్ కానుకగా 'అలా నిన్ను చేరి' టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ లను రిలీజ్ చేశారు. 

ఈ టైటిల్ 'లోగో' పోస్టర్‌ని చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసి, సినిమా సోల్ తెలిసేలా స్పెషల్ గా అట్రాక్ట్ చేశారు. ఓ పక్క పల్లెటూరు, మరోపక్క మెట్రో సిటీ .. ఈ రెండు ప్రదేశాలను కలుపుతూ హీరోని బ్యాక్ నుంచి చూపించారు. ఈ పోస్టర్ చూస్తుంటే పల్లెటూరు నుంచి కెరీర్ కోసం సిటీకి చేరిన కుర్రాడు, అమ్మాయి ప్రేమలో పడి తన జర్నీ ఎలా సాగించాడనేది ఈ సినిమా కథ అని తెలుస్తోంది.  

‘అలా నిన్ను చేరి’ సినిమాకు చంద్రబోస్ సాహిత్యాన్ని అందించగా, సుభాష్ ఆనంద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆండ్రూ కెమెరా మెన్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్‌గా విఠల్ .. ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరరావు.. ఫైట్ మాస్టర్లుగా సాల్మన్ - రామకృష్ణ వ్యవహరిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

More Telugu News