Harish Rao: సిద్ధిపేట వెంకటేశ్వరస్వామి ఆలయానికి బంగారు కిరీటం సమర్పించిన మంత్రి హరీశ్ రావు

  • ఇవాళ వైకుంఠ ఏకాదశి
  • వెంకటేశ్వరస్వామి కోసం 1.792 కిలోల కిరీటం తయారీ
  • కిలో బంగారం సమకూర్చిన ఆలయ వర్గాలు
  • మిగిలిన బంగారం అందించిన హరీశ్ రావు, ఇతర దాతలు
Harish Rao offers golden crown to Venkaterswara Swamy temple in Siddipet

ఇవాళ వైకుంఠ ఏకాదశి. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి హరీశ్ రావు వెంకటేశ్వరస్వామి వారి పట్ల భక్తిప్రపత్తులు చాటుకున్నారు. సిద్ధిపేటలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి బంగారు కిరీటం సమర్పించారు. 

ఈ కిరీటం తయారీలో ఆలయ వర్గాలతో పాటు హరీశ్ రావు కూడా పాలుపంచుకున్నారు. ఈ స్వర్ణ కిరీటం బరువు 1.792 కిలోలు కాగా, ఇందులో కిలో బంగారం ఆలయ వర్గాలు కొనుగోలు చేయగా, మిగిలిన బంగారం హరీశ్ రావు తదితర దాతలు సమకూర్చారు. ఈ పసిడి కిరీటం విలువ కోటి రూపాయలకు పైనే ఉంటుందని అంచనా. 

ఇవాళ సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి విచ్చేసిన మంత్రి హరీశ్ రావు... కిరీటాన్ని ఆలయ పీఠాధిపతికి అందించారు. స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు.

  • Loading...

More Telugu News