మంత్రి ఆదిమూలపు సురేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం జగన్
- మంత్రి ఆదిమూలపు సురేశ్ కు మాతృవియోగం
- అనారోగ్యంతో థెరీసమ్మ కన్నుమూత
- నిన్న ప్రకాశం జిల్లాలో అంత్యక్రియలు
- నేడు ఎర్రగొండపాలెం విచ్చేసిన సీఎం జగన్
ఈ నేపథ్యంలో, సీఎం జగన్ నేడు ప్రకాశం జల్లా ఎర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ నివాసానికి వెళ్లారు. థెరీసమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. మృతితో విచారంలో ఉన్న ఆదిమూలపు సురేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది.