రెండో టెస్టులో పంత్ మెరుపు అర్ధ సెంచరీ
- 94కే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్
- బంగ్లా బౌలర్లపై పంత్ ఎదురుదాడి
- తొలి ఇన్నింగ్స్ లో 227 పరుగులు చేసిన బంగ్లా
అయితే, లంచ్ కు ముందు పుజారాను తైజుల్ వెనక్కి పంపాడు. దాంతో తొలి సెషన్ లో భారత్ 86/3 స్కోరుతో నిలిచింది. అయితే, బ్రేక్ నుంచి వచ్చిన వెంటనే విరాట్ కోహ్లీ.. తస్కిన్ అహ్మద్ బౌలింగ్ లో పెవిలియన్ చేరడంతో భారత్ 94/4 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ తోడుగా రిషబ్ దూకుడుగా ఆడుతున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోతున్న పంత్ 49 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్ 55 ఓవర్లకు 190/4 స్కోరుతో నిలిచింది. పంత్ 68, శ్రేయస్ 40 పరుగులతో ఉన్నారు.