CM Jagan: నాటా తెలుగు మహాసభలకు సీఎం జగన్ కు ఆహ్వానం

  • వచ్చే ఏడాది జూన్ 30 నుంచి నాటా తెలుగు మహాసభలు
  • సీఎం జగన్ ను కలిసిన నాటా కార్యవర్గం
  • పేరుపేరునా పలకరించిన సీఎం
  • శాలువా కప్పి ఇన్విటేషన్ కార్డు అందించిన నాటా సభ్యులు
NATA members invites CM Jagan for Telugu Maha Sabhalu

వచ్చే ఏడాది అమెరికాలో జరిగే నాటా తెలుగు మహాసభలకు సీఎం జగన్ కు ఆహ్వానం అందింది. నాటా అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ రెడ్డి, నాటా సభ్యులు ఇవాళ తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిశారు. తాము నిర్వహించే మహాసభలకు హాజరు కావాలంటూ ఆహ్వానించారు. 

నాటా తెలుగు మహాసభలు 2023 జూన్ 30 నుంచి జులై 2వ తేదీ వరకు అమెరికాలోని డాలస్ లో జరగనున్నాయి. ఈ మహాసభలకు డాలస్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిలవనుంది. 

కాగా, తనను కలిసిన నాటా కార్యవర్గాన్ని సీఎం జగన్ పేరుపేరునా పలకరించారు. ఈ సందర్భంగా నాటా సభ్యులు సీఎం జగన్ కు శాలువా కప్పి సన్మానించారు. తెలుగు మహాసభల ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు.

More Telugu News