Theft: కుక్కకు కోడిమాంసం వేసి... గుంటూరులో లక్షలు దోచుకెళ్లారు!

  • గుంటూరులో ఓ మిర్చి కంపెనీలో దోపిడీ
  • రూ.20 లక్షల నగదు అపహరణ
  • వాచ్ మన్ ను కట్టేసిన దొంగలు
  • దొంగలు పారిపోయే క్రమంలో అరిచిన కుక్క
  • చికెన్ వేసి దాని నోరు మూయించిన దొంగలు
Thieves silent a dog with chicken and stole lakhs of rupees in Guntur

గుంటూరులో ఓ మిర్చి ఎక్స్ పోర్ట్స్ కంపెనీలో భారీ దోపిడీ జరిగింది. దోపిడీకి వచ్చిన దొంగలు అక్కడున్న కుక్కకు కోడిమాంసం వేసి తమ పని పూర్తిచేసుకుని వెళ్లారు. వెంకటప్పయ్య కాలనీ లాల్ పురం రోడ్డు చివరన ఓ మిర్చి కంపెనీ ఉంది. ఇక్కడి నుంచి మలేసియా తదితర దేశాలకు మిర్చి ఎగుమతులు చేస్తుంటారు. 

అయితే దొంగలు ఈ కంపెనీపై కన్నేశారు. గత అర్ధరాత్రి దాటిన తర్వాత ఇద్దరు దొంగలు బైక్ పై కంపెనీ వద్దకు వచ్చారు. తొలుత వాచ్ మన్ ఆవులయ్యను కట్టేశారు. వారు చంపేస్తామని బెదిరించడంతో వాచ్ మన్ కిక్కురుమనలేదు. వారిద్దరిలో ఓ దొంగ కంపెనీ ఆఫీసు రూమ్ తాళం పగులగొట్టి లోపలున్న డబ్బును దోచుకున్నాడు. 

ఇక, కంపెనీ నుంచి బయటికి వస్తుండగా, కుక్క అరవడంతో, దాని నోరు మూయించేందుకు చికెన్ ముక్కలు వేశారు. కోడిమాంసం ముక్కలు తినడంలో కుక్క బిజీగా ఉండగా, ఆ దొంగలిద్దరూ బైక్ పై పారిపోయారు. 

దోపిడీపై సమాచారం అందుకున్న మిర్చి కంపెనీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.20 లక్షలకు పైగా నగదు దోపిడీకి గురైందని వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.

More Telugu News