మాచర్లలో అల్లర్లకు వీరిద్దరే సూత్రధారులు: జూలకంటి బ్రహ్మారెడ్డి
- పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, తురకా కిశోర్ లే కారణమన్న జూలకంటి
- తాము కరపత్రాలను పంచుతుంటే వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు దిగారని విమర్శ
- ఈరోజు కూడా తమ కార్యాలయాలపై దాడి చేశారని ఆరోపణ
గంట ముందు నుంచే వైసీపీ శ్రేణులు అక్కడ మకాం వేసినా పోలీసులు పట్టించుకోలేదని విమర్శించారు. వైసీపీ దాడులను తాము ప్రతిఘటించిన తర్వాత పోలీసులు వచ్చి తమ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారని అన్నారు. ఈ రోజు కూడా తమ కార్యాలయాలపై దాడి చేశారని, కార్యాలయంలో నగదు ఎత్తుకుపోయారని చెప్పారు. మాచర్లలో జిల్లా ఎస్పీ ఉన్నప్పటికీ ఈ ఘటనలు కొనసాగుతుండటం దురదృష్టకరమని అన్నారు.