Avatar 2: అవతార్ కు రూ.20 కోట్ల టికెట్లు ముందే బుకింగ్

  • తొలి రోజు రూ.40-50 కోట్ల కలెక్షన్లు ఉంటాయని అంచనా
  • భారత్ లో ఈ ఘనత ఈ చిత్రానికే సొంతం
  • సినిమా పట్ల పెరిగిపోతున్న ఆసక్తి
Avatar The Way of Water advance booking crosses Rs 20 crore in India tickets worth over Rs 2500 sold out in several cities

అవతార్-2 (ద వే ఆఫ్ వాటర్)  సినిమా శుక్రవారం విడుదల అవుతుండగా, బాక్సాఫీసు వద్ద భారీ సందడి నెలకొంది. అడ్వాన్స్ బుకింగ్ లో రూ.20 కోట్ల విలువైన టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ తరహా రికార్డు ఈ ఏడాది కేజీఎఫ్ చాప్టర్ 2, ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర తదితర చిత్రాలకే సాధ్యమైంది.

గురువారం రాత్రి నాటికి రూ.20 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ లు జరిగినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది టాప్ 5 అడ్వాన్స్ కలెక్షన్లలో ఇది కూడా ఒకటి. అయినా కానీ, కేజీఎఫ్ చాప్టర్ 2 రూ.80 కోట్ల కంటే చాలా దిగువనే ఉంది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఐమ్యాక్స్ థియేటర్లలో ఒక్కో టికెట్ రూ.2,500-3,000 కూడా అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. 

శుక్రవారం తొలి రోజు దేశవ్యాప్తంగా అవతార్-2 సినిమా రూ. 40-50 కోట్లను వసూలు చేయచ్చని అంచనా. మరే హాలీవుడ్ సినిమాకు భారత్ లో ఈ ఘనత సాధ్యపడలేదు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సానుకూల అభిప్రాయాలు, రివ్యూలు వస్తుండడంతో, ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమా పైరసీ కాపీ లీక్ అయినట్టు సమాచారం వ్యాప్తి చెందుతోంది. అయితే గ్రాఫిక్స్ ఆధారిత చిత్రం కనుక థియేటర్లలో చూసిన అనుభవం ఫోన్లలో, కంప్యూటర్లలో చూసినప్పుడు ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

More Telugu News