శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు రజనీకాంత్
- ఆయన వెంట పెద్ద కుమార్తె ఐశ్వర్య
- నేటి ఉదయం దర్శనం
- ఆ తర్వాత కడప అమీన్ దర్గాకు ప్రయాణం
ఈరోజు ఉదయం రజనీకాంత్, ఐశ్వర్య స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక క్యూలైన్ నుంచి వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు రజనీకాంత్ అభివాదం చేశారు. అనంతరం అక్కడి నుంచి కడప జిల్లాలోని అమీన్ పీర్ దర్గాను సందర్శించేందుకు రజనీకాంత్ వెళ్లారు. దర్గా దర్శనానికి ఏఆర్ రెహమాన్ కూడా రానున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసింది. రజనీకాంత్ కొత్త చిత్రం ‘లాల్ సలామ్’ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆధ్యాత్మిక పర్యటన పెట్టుకున్నట్టు తెలిసింది.