Vishwaksen: 'ధమ్కీ' ఈవెంటులో 'ఆదిత్య 999' గురించి స్పందించిన బాలయ్య!

  • విష్వక్సేన్ హీరోగా రూపొందిన 'ధమ్కీ'
  • బాలయ్య చీఫ్ గెస్టుగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ 
  • ఆడిటోరియంను హుషారెత్తించిన బాలయ్య
  • ట్రైలర్ లోని డైలాగ్స్ పై సెటైర్లు  
  • తన తదుపరి సినిమాల గురించి ప్రస్తావన  
Dhamki Trailer Release Event

విష్వక్సేన్ హీరోగా .. ఆయన దర్శక నిర్మాణంలో 'ధమ్కీ' సినిమా రూపొందింది. లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ .. ఎమోషన్ నేపథ్యంలో ఈ కథను ప్రసన్నకుమార్ బెజవాడ అందించాడు. ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంటును నిర్వహించారు. బాలయ్య ముఖ్య అతిథిగా ఈ వేడుక జరిగింది. ఆడిటోరియంలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ బాలయ్య మైక్ ను పైకి ఎగరేసి పట్టుకుని తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. 

ఈ సినిమాలో హీరో వాడే 'ఊతపదం' డైలాగును చెబుతూ మరింత హుషారును రేకెత్తించారు. ఇక తెలంగాణ యాసలో మాట్లాడుతూ మరింత జోరు పెంచారు. ఈ సినిమాలో 'గెటవుట్ ఆఫ్ మై కార్' అనే డైలాగ్ ను గురించిన ప్రస్తావన తీసుకొచ్చారు. అదే సమయంలో మరో డైలాగ్ కూడా వాడావ్ అంటూ ఏదో విషయాన్ని గుర్తుచేయడానికి ట్రై చేసి .. దానికి కవర్ చేశారు. దాంతో ఆడిటోరియంలో మరింత సందడి పెరిగింది. 

 విష్వక్సేన్ తన మాదిరిగానే పెద్ద పొరికి అనీ .. హీరోగా .. నిర్మాతగా .. దర్శకుడిగా భలేగా మేనేజ్ చేస్తాడని అన్నారు. ఈ సినిమా చూస్తే విష్వక్సేన్ కి ఉన్న ఫ్యాషన్ ఎలాంటిదో తెలుస్తుందనీ, ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని ఈ స్థాయికి వచ్చాడంటూ అభినందించారు. 'ఇలాంటి సినిమాలను నేను చేస్తే చూడరు గనుక, నన్ను నేను ఊహించుకుంటాను' అన్నారు. 

ఇక అభిమానులు 'ఆదిత్య 999' విషయాన్ని గురించి అడిగిన దానికి ఆయన స్పందిస్తూ 'ఆదిత్య 999' వచ్చే ఏడాదిలో ఉంటుందని చెప్పారు. 'వీరసింహా రెడ్డి' గురించి చెప్పమని అడిగితే, అందుకు ఇంకా చాలా సమయం ఉందనీ, అప్పుడే చెబితే దర్శక నిర్మాతలు తనకు దొబ్బులు పెడతారంటూ నవ్వించారు.

More Telugu News