Sania Mirza: ఓటీటీ షోకి హోస్ట్ లుగా వ్యవహరించనున్న సానియా మీర్జా, షోయబ్ మాలిక్

  • సానియా, షోయబ్ విడిపోతున్నాంటూ ప్రచారం
  • వారి కాపురంలో కలతలు వచ్చాయంటూ కథనాలు
  • త్వరలో ఉర్దూ ఫ్లిక్స్ చానల్ లో 'ది మీర్జా మాలిక్ షో'
  • తాజాగా సోషల్ మీడియాలో ప్రకటన
Sania Mirza and Shoaib Malik hosts a TV show soon

భారత టెన్నిస్ తార సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ల కాపురంలో కలతలు బయల్దేరాయని, త్వరలోనే వీళ్లిద్దరూ విడాకులు తీసుకుంటున్నారని కథనాలు రావడం తెలిసిందే. సానియా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు కూడా ఊహాగానాలకు ఊతమిచ్చేలా ఉంది. 

అయితే, ఇన్ స్టాగ్రామ్ లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే ఓ పోస్టు దర్శనమిచ్చింది. ఓటీటీ షోకి సానియా, షోయబ్ హోస్ట్ లు గా వ్యవహరించనున్నారన్నది ఆ పోస్టు సారాంశం. ఉర్దు ఫ్లిక్స్ అనే ఓటీటీ వేదికపై ఈ షో ప్రసారం కానుంది. ఉర్దు ఫ్లిక్స్ ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటన చేసింది. 

ఈ ప్రోమో యాడ్ లో షోయబ్ భుజంపై తన మోచేయిని ఆన్చి సానియా నిలబడి ఉండడాన్ని చూడొచ్చు. అన్నట్టు... ఈ షో పేరు ది మీర్జా మాలిక్ షో. త్వరలోనే ఉర్దు ఫ్లిక్స్ లో ప్రసారం అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

ఈ ప్రకటనతో చాలామంది అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. సానియా, షోయబ్ కలిసి ఉండడం పట్ల హర్షం వెలిబుచ్చారు. ఇటీవల షోయబ్ ఓ మోడల్ తో సన్నిహితంగా ఉండడంతో సానియాకు నచ్చడంలేదని, అందుకే విడాకులు తీసుకుంటోందని ఇటీవల ప్రచారం జరుగుతోంది.

More Telugu News