ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ సెల్ఫీ
- విశాఖ పర్యటనకు వచ్చిన మోదీ
- మోదీతో సెల్ఫీ తీసుకున్న మంత్రి అమర్ నాథ్
- అమర్ నాథ్ సెల్ఫీలో చేతులెత్తి మొక్కుతున్న మోదీ
మోదీతో అమర్ నాథ్ తీసుకున్న సెల్ఫీకి ఓ ప్రత్యేకత ఉందన్న వాదన వినిపిస్తోంది. సాధారణంగా ఎవరైనా తమ వద్దకు సెల్ఫీ కోసమో, ఫొటో కోసమో వస్తే... ఆయా రంగాల ప్రముఖులు చిరు నవ్వులు చిందిస్తూ పోజిస్తారు. గతంలో రోజాతో సెల్ఫీ సందర్భంగా మోదీ ఇదే మాదిరిగా చిరునవ్వులు చిందిస్తూ పోజిచ్చారు. అయితే అమర్ నాథ్ సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో మోదీ... రెండు చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉండిపోయారు. ఈ సెల్ఫీని చూసిన నెటిజన్లు అమర్ నాథ్ ను ట్రోల్ చేస్తూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.