కుమారుడిని హతమార్చిన నిందితుడిని కాపుకాసి చంపేసిన తల్లిదండ్రులు!
- హత్యకు దారితీసిన పేకాట గొడవ
- రెండేళ్లుగా పగతో రగిలిపోతున్న తల్లిదండ్రులు
- శుభకార్యంలో పాల్గొనేందుకు వచ్చిన నిందితుడిని దారుణంగా హతమార్చిన వైనం
- హత్య చేసి తల, కాళ్లు వేరు చేసిన నిందితులు
- గ్రామ నడిబొడ్డున హత్య
సంగారెడ్డిలో ఉంటూ ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఈ నెల 9న బంధువుల ఇంట్లో శుభకార్యం కోసమని చిన్న చెల్మెడ గ్రామానికి వెళ్లాడు. నిన్న ఉదయం ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఆనంద్ను చూసిన ప్రవీణ్ తండ్రి అంబయ్య, తల్లి స్వరూప, సోదరుడు ప్రభుదాస్ కోపంతో రగిలిపోయారు. గొడ్డళ్లతో అతడిని వెంబడించారు. గ్రామంలోని చౌరస్తా వద్ద ఆనంద్ కళ్లలో కారం కొట్టి పట్టుకున్నారు. అనంతరం తల, చేతులు నరికేసి దారుణంగా హత్య చేశారు. తర్వాత నిందితులు నేరుగా బుధేరా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.