Special Darshan: తిరుమల శ్రీవారి దర్శనం డిసెంబరు కోటా టికెట్లు రేపు విడుదల

  • ఆన్ లైన్ లో శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు
  • నవంబరు 11వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల
  • వెబ్ సైట్ ద్వారా పొందే అవకాశం
TTD will release Drashan tcikets tomorrow

తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనానికి సంబంధించి డిసెంబరు కోటా టికెట్లను టీటీడీ రేపు (నవంబరు 11) విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు ఈ టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. రూ.300 విలువ చేసే ఈ టికెట్లను వివిధ టైమ్ స్లాట్లలో కేటాయించనున్నారు. ఈ విషయాన్ని భక్తులు దృష్టిలో ఉంచుకుని వెబ్ సైట్ ద్వారా ముందస్తుగా దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. 

అటు, తిరుమల కొండపై రద్దీ సాధారణంగా ఉండడంతో వెంకన్న దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 66,946 మంది దర్శించుకోగా, రూ.4.73 కోట్ల ఆదాయం లభించింది.

More Telugu News