లండన్ హైకోర్టులో నీరవ్ మోదీకి చుక్కెదురు!
- రూ. 13 వేల కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా నీరవ్ మోదీ
- నీరవ్ను దేశానికి రప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న భారత ప్రభుత్వం
- హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించే దిశగా నీరవ్ మోదీ
ఈ పిటిషన్ను నీరవ్ హైకోర్టులో సవాలు చేశారు. తన మానసిక ఆరోగ్యాన్ని కారణంగా చూపిస్తూ దానిని కొట్టివేయాలని అభ్యర్థించారు. తాజాగా ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం.. నీరవ్ను భారత్కు అప్పగించడం అన్యాయం, అణచివేత కాదని స్పష్టం చేసింది. హైకోర్టు తాజా తీర్పుతో నీరవ్ను భారత్కు తిరిగి తీసుకొచ్చేందుకు మార్గం సుగమమైనట్టే.
అయితే, తన పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో నీరవ్ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. హైకోర్టు తీర్పు వెలువడిన 14 రోజుల్లోపు ఆయన సుప్రీంలో అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, అవసరమైతే ఆయన యూరోపియన్ మానవ హక్కుల కోర్టును కూడా ఆశ్రయించే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.