దేశంలో శతాధిక ఓటర్లు ఎంతమందో తెలుసా?
- దేశంలో వందేళ్లు దాటిన ఓటర్ల సంఖ్య 2.49 లక్షలు
- 80 ఏళ్ల పైబడిన ఓటర్ల సంఖ్య 1.80 కోట్లుగా ఉందన్న సీఈసీ
- పూణెలో ఓటరు నమోదు చైతన్య కార్యక్రమం
దేశంలోనే తొలి ఓటరు అయిన హిమాచల్ ప్రదేశ్కు చెందిన శ్యాం శరణ్ నేగి ఇటీవల మరణించారు. ఆయన తన మరణానికి మూడు రోజుల ముందు కూడా పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారని, ఇది స్ఫూర్తిదాయకమని అన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ప్రతి ఏడాది చేపడుతున్నామని, అయితే, ఈసారి పట్టణ ఓటర్ల భాగస్వామ్యం పెంచాలన్నదే తమ లక్ష్యమని రాజీవ్ కుమార్ తెలిపారు.