సెమీస్ ముంగిట టెన్షన్.. గాయంతో ప్రాక్టీస్ నుంచి వెళ్లిపోయిన విరాట్ కోహ్లీ!
- నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డ కోహ్లీ
- హర్షల్ పటేల్ వేసిన బంతి గజ్జల్లో తగిలి గాయం
- రేపు ఇంగ్లండ్ తో సెమీఫైనల్ ఆడనున్న భారత్
నిన్న కెప్టెన్ రోహిత్ శర్మకు సైతం ఇలానే స్వల్ప గాయానికి గురయ్యాడు. త్రౌ డౌన్ స్పెషలిస్ట్ రఘు వేసిన బంతి రోహిత్ కుడి ముంజేయికి గట్టిగా తగిలింది. దాంతో, రోహిత్ నొప్పితో విలవిలలాడాడు. అయితే, 40 నిమిషాల తర్వాత తను మళ్లీ ప్రాక్టీస్ చేయడంతో అంతా ఊపిరిపీల్చుకునున్నారు. రోహిత్ ఘనట మరవకముందే కోహ్లీ గాయపడిన వార్త అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ప్రస్తుతం కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ టోర్నీలో భారత్ తరఫున టాప్ స్కోరర్ గా ఉన్నాడు. ఐదు మ్యాచ్ల్లో 123 సగటుతో 246 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ తో గురువారం జరిగే సెమీఫైనల్లో తను బరిలోకి దిగుతాడో లేదో చూడాలి.