వల్లభనేని వంశీ వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చిన మహిళ
- విజయవాడ గ్రామీణ మండలం నిడమానూరులో వంశీ పర్యటన
- ఇక్కడి నుంచి ఐటీ కంపెనీలు వెళ్లిపోయాయన్న మహిళ
- ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను బాగా చూస్తున్నట్టున్నారన్న వంశీ
- ఆ పత్రికల వల్లే మీరు పెద్దవాళ్లయ్యారన్న మహిళ
దీనికి సమాధానంగా... అక్కా, మీరు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను బాగా చూస్తున్నట్టున్నారని వంశీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు ఆమె అదే స్థాయిలో ప్రతిస్పందించారు. ఈ పత్రికల వల్లే కదా మీరు పెద్దవాళ్లు అయిందని అన్నారు.
దీంతో వంశీ స్పందిస్తూ ఇక్కడి వాతావరణంలో ఉద్యోగులు పని చేయలేకపోతున్నారని... అందుకే చాలా కంపెనీలు వెళ్లిపోయాయని చెప్పారు. దీనికి ప్రతిస్పందనగా... మీరు ఇంకా హైదరాబాదునే అభివృద్ధి చేయాలనుకుంటున్నారని ఆమె విమర్శించారు.